“...నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను.”
మార్కు 2:17 BSB
యేసు లేవీ అనే పన్ను వసూలుదారుడిని తన శిష్యుడిగా ఎంచుకున్నందుకు మత నాయకులు ఆశ్చర్యపోయారు. మత నాయకులు పన్ను వసూలుదారులను దేశద్రోహులుగా చూసేవారు - ఎందుకంటే పన్ను వసూలుదారులు వ్యక్తిగత లాభం కోసం రోమన్ అణచివేతదారులతో సహకరించేవారు. కానీ యేసు లేవీని మాత్రమే పిలవలేదు; ఆయన అతనితో మరియు ఇతర బహిష్కృతులతో భోజనం చేశాడు. ఒక వైద్యుడు రోగుల బాగుకోసం పనిచేయునట్లు, ఒక మెకానిక్ విరిగిన లేదా పనిచేయని వాటిని బాగు చేసినట్లుగా, యేసు పాపులను స్వస్థపరచడానికి మరియు పునరుద్ధరించడానికి వచ్చాడు. వారి స్వంత నీతిలో నమ్మకం ఉన్నవారి కోసం కాదు గాని, వారి అవసరాన్ని తెలిసిన వారి వైపు ఆయన ఆకర్షితుడయ్యాడు.
చాలా తరచుగా, దేవుని వద్దకు రాకముందు మనం మనల్ని మనం సరిదిద్దుకోవాలని మనం అనుకుంటాము. కానీ యేసు మన గందరగోళంలో మనల్ని కలుస్తాడు. మనం పరిపూర్ణతకు మనల్ని మనం శుద్ధి చేసుకోలేము, మనల్ని మనం మార్చుకోలేము - ఆయన మాత్రమే మనల్ని మార్చగలడు. ఏ హృదయం కూడా ఆయన మార్చలేనంత చీకటిగా ఉండదు, ఏ పాపం కూడా ఆయన స్వస్థపరచలేనంత లోతుగా ఉండదు. మీరు కోరుకుంటే, యేసు మీ జీవితంలోకి వస్తాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలాగే అంగీకరిస్తాడు - కానీ ఆయన మిమ్మల్ని అలా విరిగి నలిగిన స్థితిలో విడిచి వెళ్ళలేడు ఎందుకంటే ఆయనకు మీపై చాలా ప్రేమ ఉంది.
0 కామెంట్లు